ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనుషుల జీవనశైలి ఆహార గలవాట్లు ప్రతిరోజు మారుతూనే ఉన్నది. దీనివల్ల కొంతమంది డయాబెటిస్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువైంది. ఇక ఈ వ్యాధి బారిని పడ్డవారు 10 లో 6% మంది ఉన్నారని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అయితే ఈ డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటిస్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు ఏమైనా మందులు ఉన్నాయా అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఎక్కువ శాతం మంది డయాబెటిస్ పేషెంట్లు తమ రక్తంలోనే ఉంటే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడం కోసమే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండనే ఉంటారు. ఈ క్రమంలోని కొంతమంది మెడిసిన్ ద్వారా మరికొంతమంది వారికి తమకు తోచిన ఆరోగ్య చిట్కాలను ఉపయోగించి తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్లు మామిడి ఆకులు ఉపయోగించడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆకులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. మామిడి ఆకులలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయట.


మామిడి ఆకులలో ఉంటే యాంటీ మైక్రోబియల్  గుణాలు మన శరీరంలోని రక్తంలో ఉండే చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. మామిడి ఆకులలో ఉండే విటమిన్ సి మధుమేహంతో పాటు కొవ్వు పదార్థాలను కూడా అదుపులో ఉంచేలా చేస్తుంది. అయితే మనం ప్రతిరోజు కొన్ని ఆకులను తీసుకొని నీళ్లలో ఉడకబెట్టి ఆ తర్వాత.. ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల డయాబెటిస్ రోగులకు చక్కటి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా కనీసం నెలలో 15 రోజులు చేస్తే మన శరీరంలో ఉండే చక్కెర స్థాయి అదుపులోకి వస్తాయట. ఈ ఆకులలో చేదు గుణం ఉంటుంది కనుక చక్కెర స్థాయిని నియంత్రించే గుణం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: