తెలుగు చిత్ర పరిశ్రమకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి నటించిన సినిమా ఫిదా. ఈ సినిమాతోనే సాయి పల్లవి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవికి వరుస అవకాశాలు వచ్చాయి. ఆమె వరుసగా నటించిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ అయ్యాయి. ఇక తరువాత సాయి పల్లవి నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా అక్కటుకోలేకపోయాయి.

ఇక సాయి పల్లవి నటించిన క‌ణం`, `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`, మారి 2`, ఎన్జీకే వంటి సినిమాలో నటించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన  బైలింగ్వ‌ల్, స్ట్ర‌యిట్, డ‌బ్బింగ్ చిత్రాల‌న్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేకపోయాయి. ఈ సినిమాలోని సాంగ్స్, సాయి పల్లవి డాన్స్ యూ ట్యూబ్ లో రికార్డు సృష్టించాయి.

ఇక ముఖ్యంగా చెప్పాలంటే.. సాయిప‌ల్ల‌వి కెరీర్ లో మెమ‌ర‌బుల్ మూవీగా నిలుస్తుంద‌నుకున్న `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`.. ఊహాతీత ఫ‌లితాన్ని చూసింది. ఇక సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇక `విరాట ప‌ర్వం` విడుద‌ల‌కు సిద్ధం కాగా.. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ మూడు సినిమాలో ఒక‌దానితో ఒక‌టి పొంత‌న లేని పాత్ర‌ల్లో న‌టిస్తోంది ప‌ల్ల‌వి. క ఇదిలా ఉంటే `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` త‌ర‌హాలోనే `శ్యామ్ సింగ రాయ్`లోనూ బెంగాలీ అమ్మాయిగా  కనిపించనున్నట్లు సమాచారం. అయితే క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న `శ్యామ్ సింగ రాయ్` అయినా ప‌ల్ల‌వి నెగ‌టివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మంచి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: