మెగా మేనల్లుడు టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడా... త్వరలో యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ఆస్పత్రిలో చేరగా అతడికి కాలర్ బోన్ చికిత్స అనంతరం ఇటీవలే పూర్తిగా కోలుకున్నారు. పూర్తిగా కోలుకుని ఇంటికి రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే తాజాగా సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటున్నాయి. 

అంతే కాకుండా ఒక హీరోయిన్, మోడల్ తోనే తేజ్ ప్రేమలో ఉన్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలకు కారణం హీరోయిన్ సోషల్ మీడియా పోస్టులే కావడం విశేషం. ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్ తో తిక్క సినిమా లో కలిసి నటించిన భామ లారిస్సా బోనెసి... ఈమె బ్రెజిలియన్ మోడల్ మరియు హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ బ్యూటీ తో సాయి ధరమ్ తేజ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై మెగా కాంపౌండ్ మాత్రం స్పందించడం లేదు. అంతే కాకుండా ఈ హీరోయిన్ తో త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ విడుదల సమయంలో లారిస్సా...నా తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈ రోజు విడుదల అవుతుంది అంటూ లవ్ సింబల్ జోడించి ఈ పోస్ట్ చేసింది. అప్పటి నుండి ఫిల్మ్ నగర్ లో తేజ్ రిలేషన్ షిప్ పై వార్తలు మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత ఐ మిస్ యూ తేజ్ అంటూ ట్వీట్ చేసింది. దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని వార్తలు ఎక్కువైపోయాయి. ఇక తాజాగా లారిస్సా ఐ యామ్ ఇన్ లవ్( నేను ప్రేమ లో ఉన్నాను) అంటూ మరో పోస్ట్ చేసింది. ఇక తాజా పోస్ట్ తో లారిస్సా ప్రేమలో ఉందన్న విషయం పై క్లారిటీ వచ్చింది. అయితే అది తేజ్ తోనేనా మరెవరైనా హీరో ఉన్నారా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: