టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటిల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలగా దూసుకుపోతున్న వీరిద్ద‌రికీ ఉన్న సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అక్క‌డికే వ‌స్తున్నా ఆగండీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రానాల మ‌ధ్య ఎటువంటి బంధుత్వం లేదు. కానీ, వీరిద్ద‌రి మ‌ధ్య ఒక కామ‌న్ పాయింట్ ఉంది. అదేంటంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రానాల‌ను వెండితెర ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది ఒక్క‌డే ద‌ర్శ‌కుడు.

ఆయ‌న ఎవ‌రో కాదు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `లీడ‌ర్‌` చిత్రంతో దగ్గుబాటి రానా సినీ రంగ‌ప్ర‌వేశం చేశాడు.    ఏ.వి.యం. ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై ఎం.శరవణన్, ఎం. ఎస్ గుహన్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్‌గా న‌టించింది. 2010లో విడుద‌లైన ఈ చిత్రం బాగానే ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత రానా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన `విరాట పర్వం` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే మ‌రోవైపు ఈయ‌న బాబాయ్ వెంక‌టేష్‌తో ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నాడు.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే.. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడ్డాడు. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా సినిమాలు చేసిన విజ‌య్‌..పెళ్ళిచూపులు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవ‌ర్ నౌట్ స్టార్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆపై గీత గోవిందంతో భారీ మార్కెట్‌ను ఏర్ప‌ర్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న‌ `లైగ‌ర్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2022 ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: