ఆయన ఎవరో కాదు శేఖర్ కమ్ముల. ఈయన దర్శకత్వంలో వచ్చిన `లీడర్` చిత్రంతో దగ్గుబాటి రానా సినీ రంగప్రవేశం చేశాడు. ఏ.వి.యం. ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎం.శరవణన్, ఎం. ఎస్ గుహన్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్గా నటించింది. 2010లో విడుదలైన ఈ చిత్రం బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత రానా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన `విరాట పర్వం` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మరోవైపు ఈయన బాబాయ్ వెంకటేష్తో ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడ్డాడు. ఆ తర్వాత అడపా తడపా సినిమాలు చేసిన విజయ్..పెళ్ళిచూపులు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విడుదలైన `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నౌట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. ఆపై గీత గోవిందంతో భారీ మార్కెట్ను ఏర్పర్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన `లైగర్` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2022 ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.