ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికులు ఎప్పుడూ సినిమా థియేటర్ లలో విడుదల అవుతుందా... ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా  ఒకటి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.  అలాగే గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఈ సినిమాను  మే 12 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే చిత్ర బృందం  ప్రమోషన్ లెస్ జోరులో పెంచింది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పాటను చిత్ర బృందం విడుదల చేయబోతోంది. అలాగే ఈరోజు చిత్ర బృందం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ ను తెలియజేసింది.

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  అదే విధంగా సర్కారు వారి పాట సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది.  సూపర్ హై బడ్జెట్ కేటగిరీ మూవీ కింద మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు 10 రోజుల పాటు 45 రూపాయలు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది.  ఈ అంశం సర్కారు వారి పాట సినిమాకు చాలా వరకు కలిసి వచ్చేలా  కనబడుతోంది.  ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండడం టికెట్ రేట్ల పెరుగుదలతో బాక్సాఫీస్ దగ్గర  ఈ సినిమాకు  కలెక్షన్లు కూడా భారీగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: