రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తరికెక్కిన బాహుబలి సిరీస్ మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లలో ,  అంతకుమించిన మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. దానితో ప్రభాస్ కు రెమ్యూనిరేషన్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా తీసుకోనంత రెమ్యూనిరేషన్ ను ప్రభాస్ ఒక్కో మూవీ కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ప్రభాస్ తన ఒక్కో సినిమాకు దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పరుష్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీ లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కాకుండా సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రభాస్ "అర్జున్ రెడ్డి" మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ లో కూడా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలపై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: