ప్రియా భవాని శంకర్.. భవాని శంకర్, తంగం భవాని శంకర్ లకు జన్మించిన ప్రియా భవాని శంకర్ కి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చెన్నైలో SBOA మెట్రిక్యులేషన్ మరియు హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్య నభ్యసించిన ఈమె కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది . మీడియా రంగంలోకి ప్రవేశించిన తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా అందుకుంది.. మొదటిసారి తమిళ వార్త ఛానల్ పుతియా తలైమురై టెలివిజన్ ఛానళ్ లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసింది. అయితే మొదటి గుర్తింపు ఈమెకు అక్కడే లభించింది . ఆ తర్వాత స్టార్ విజయ్ టెలివిజన్ యొక్క కళ్యాణం ముదల్ కాదల్ వరై లో సీరియల్ నటిగా పనిచేసింది.

ఇక్కడ భారీ పాపులారిటీ అందుకున్న ప్రియా భవాని శంకర్ ఆ తర్వాత వైభవ్ రెడ్డికి జోడిగా 2017 లో వచ్చిన మేయాధ మాన్ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు ఉత్తమ మహిళ నూతన నటిగా సైమా అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రియా భవాని శంకర్ .. కార్తీతో కలిసి కడైకుట్టి సింగం లో నటించింది.. ఆ తర్వాత మాన్స్టర్ తో పాటు మరెన్నో చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న ఈమె కేవలం సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది . 2020లో టైం ఎన్నా బాస్ అనే వెబ్ సిరీస్ లో డాక్టర్ భారతి పాత్రలో నటించిన ఈమె.. అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.


మరొకవైపు బాధితుడు అనే వెబ్ సిరీస్ లో పవిత్ర క్యారెక్టర్ పోషించగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరొకపక్క ఇండియన్ టు సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇకపోతే ఈరోజు ఆమె పుట్టినరోజు కాబట్టి ఆమె గురించి ఆమె కెరియర్ గురించి తెలియని ఈ విషయాలు మీ కోసమే. 1989 డిసెంబర్ 31వ తేదీన జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు 32వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: