సాధారణంగా ఒక ఫెయిల్యూర్ హీరోతో నటించడానికి హీరోయిన్స్ భయపడుతూ ఉంటారు. దీనికి కారణం ఆహీరో ఇమేజ్ తమను వెంటాడుతుంది అన్న సెంటిమెంట్. అయితే సూపర్ సక్సస్ లను అందుకుని క్రేజీ హీరోగా విజయ్ మారిపోయినా అతడి వల్ల ఒక్క రష్మికకు తప్పించి అతడితో నటించిన మరి ఏహీరోయిన్ కు అదృష్టం కలిసి రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

విజయ్ దేవరకొండను యూత్ కు బాగదగ్గర చేసిన మూవీ ‘పెళ్ళి చూపులు’ ఈమూవీలో విజయ్ తో నటించిన రితు వర్మ మంచి క్రేజీ హీరోయిన్ అవుతుందని భావించారు. అయితే ఆతరువాత ఆమె కొన్ని సినిమాలలో నటించినా ఏసినిమాతోను పెద్దగ ఆమె ఇమేజ్ ని పెంచుకోలేక పోవడంతో తమిళంలో సినిమాలు చేసుకుంటోంది.

విజయ్ ను టాప్ హీరో రేంజ్ కి తీసుకు వెళ్ళిపోయిన ‘అర్జున్ రెడ్డి’ మూవీలో నటించిన షాలినీ పాండే హీరోయిన్ గా ఎదగలేకపోవడం ఎవరికీ అర్ధంకాని సమాధానంలేని ప్రశ్న. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేక రాజ్ తరుణ్ తో చేస్తున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆమెకే తెలియని పరిస్థితి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉన్నా ఆమెకు కనీసం మిడిల్ రేంజ్ యంగ్ హీరోలు కూడ అవకాశాలు ఇవ్వక పోవడం అత్యంత ఆశ్చర్యకరం. 

ఈలిస్టులో ప్రముఖంగా పేర్కొనవలసినది విజయ్ తో ‘టాక్సీవాలా’ మూవీలో నటించిన ప్రియాంక జవల్కర్. ఈమె హాట్ ఫోటో షూట్స్ ఎన్నిఇస్తున్నా చాలామంది దర్శక నిర్మాతలు ఈమెను పట్టించుకోవడం లేదు. అయితే విజయ్ తో నటించిన రష్మిక మాత్రం టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోవడమే కాకుండా 2కోట్ల భారీ పారితోషికం ఇస్తాము అంటూ ఆమె చుట్టూ తిరుగుతున్నా ఆమె డేట్స్ దొరకని పరిస్థితి. అయితే ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను పట్టించుకోకుండా ఈమధ్య విజయ్ ముంబాయ్ కి వెళ్ళినప్పుడు కియారా అద్వాని విజయ్ తో పబ్ లకు పార్టీలకు వెళుతూ తిరిగి విజయ్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: