టాలీవుడ్ లో ఒకప్పటి అందాల తార..ప్రముఖ నటి
జమున ని అభినవ సత్యభామ, అందాల చందమామ అని పిలిచే వారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో ఎన్నో సినిమాల్లో నటించిన
జమున అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు. పాత తరం హీరోయిన్లు ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది సావిత్రి, జమున. ఈ ఇద్దరు హీరోయిన్లు రీయల్ లైఫ్ లో కూడా నిజంగా అక్కాచెల్లెళ్లలా ఉండేవారి అంటారు.
సావిత్రి తనకు ఏ కష్టం వచ్చినా..వెంటనే
జమున వద్దకు వచ్చి తన బాధచెప్పుకొని కాస్త స్వాంతన పొందేవారట.
అప్పట్లో
జమున ఏ హీరో తో అయినా చాలా డామినేషన్ గానే నటించేవారని అంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో
జమున మాట్లాడుతూ..తన జీవితంలో ఒక భయంకర సంఘటనలో అదే..తనకి హెడ్ షేక్ రావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు. తనకు ఎవీఎం సంస్థతో ఎంతో అనుబంధం ఉందని..ఆ సంస్థ తనకు మాతృసంస్థలాంటిదని అన్నారు. ఈ సంస్థలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించానని అన్నారు. ఆ బ్యానర్లో నేను 14 సినిమాల వరకూ చేశానని అన్నారు.
తెలుగులోని 'లేత మనసులు' మంచి విజయం సాధించింది. ఈ సినిమాను రిమేక్ చేశారు..అందులో కూడా నేనే నటించాను. ఆ రోజున 'అందాల ఓ చిలుక .. ' పాటను తమిళంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో హరినాథ్ కి బదులుగా తమిళ హీరో జయశంకర్ ని తీసుకున్నారు. 'అందాల ఓ చిలుక .. ' పాట చిత్రీకరిస్తున్న సమయంలో గడ్డివాము నుంచి జారి నా ఒళ్లో వాలిపోయే సిన్..అంతకు ముందు బాగానే ప్రాక్టీస్ చేశారు.
తీరా టేక్ సమయంలో ఒక్కసారే నా తలమీద పడిపోయారు..ఆయన కాళ్లు బలంగా తాకాయి. అప్పుడు కాస్త తలనొప్పి అనిపించింది..కానీ కొద్ది రోజుల తర్వాత తల వణికిపోవడం మొదలైంది. అప్పటి నుంచి నా తల షేక్ కావడం మొదలైంది అని వాపోయారు.