టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై అత్యంత భారీ ఖర్చుతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి గారు టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. 

ఇకపోతే మంచి మాస్ మరియు కమర్షియల్ హంగుల కలబోతగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు టాక్. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలోని ఈ సినిమా పాటలను అతి త్వరలో రిలీజ్ చేయబోతోంది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాలోని ఒక ప్రత్యేకమైన మాస్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతోందనేది తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ ని ఎంతో అదరగొట్టేలా సిద్ధం చేసిన దేవిశ్రీ, ప్రత్యేక గీతమైన మాస్ సాంగ్ ని మరింత అద్భుతంగా కంపోజ్ చేసారని, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర కాసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఖుషి ఖబర్ చెప్పడం జరిగింది. 

ఇప్పడే దేవిగారు మా సరిలేరు నీకెవ్వరు కోసం కంపోజ్ చేసిన మాస్ సాంగ్ విన్నాను, ఈ సాంగ్ ముందు కేక అనే పదం చాలా చిన్నదని, ఇంత బాగా ట్యూన్ ఇచ్చిన దేవి గారికి తన తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని అన్నారు. ఇక ఆయన చేసిన ట్వీట్ తో ఎంతో మురిసిపోతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్, తప్పకుండా ఆ సాంగ్ రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో దుమ్మురేపడం ఖాయమని ఎంతో ఆనందంతో అనిల్ సుంకర పై పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా అనిల్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: