గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఏ రేంజ్ లో సెన్షేషనల్ సక్సెస్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు స్టార్స్ గా సెటిలయ్యారు. ఆ సినిమా విడుదల్ర సంవత్సరం పైనే అవుతుంది. కానీ పరుశురామ్ ఇంతవరకు ఆ హీరో సినిమాహీరో తో సినిమా అంటూ వచ్చాడు. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. ఎట్టకేలకు దర్శకుడు పరుశురామ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. నాగచైతన్య హీరోగా 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమాను చేయబోతున్నాడు. చైతూ 20వ చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రీసెంట్‌గా వచ్చింది.

 

వెంకీమామ సినిమాతో ఇటీవలే వచ్చిన నాగచైతన్య వచ్చే నెల నుండే పరుశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం వంటి విభిన్నమైన ప్రేమ కథతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నాడు. దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో సమంత కూడా చైతూ నటించడానికి రెడీ అన్నట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. 

 

చైతూతో కలిసి సమంత ఈ ఏడాది మజిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి నటిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 2020లో కూడా మరో సినిమాతో రావాలనే ఉద్దేశ్యంతో ఈ అక్కినేని కపుల్ పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజా సమాచారం అందుతోంది. నాగచైతన్యతో సమంత అనే విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. షూటింగ్ ప్రారంభం సమయంకు హీరోయిన్ విషయమై పరశురామ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. చైతూ, సమంత కలిసి నటిస్తే మరో గీత గోవిందం, మజిలీ అవడం ఖాయం అంటూ అక్కినేని అభిమానులు సంబరపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: