ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ప్రపంచ వ్యాప్తంగా మాత్రం భారీ వసూళ్లు సాధించింది. దాదాపు ఈ సినిమా 400 కోట్ల వరకు వసూళ్లు చేయడంతో నిర్మాతకు కాసుల పంట పండింది. కాని తెలుగులో సినిమాను కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఆరిపోయారు. బయ్యర్ల కష్టాలు వినే వాళ్ళు మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ని కాపాడుకున్నాడు. 

 

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ లో అడుగుపెట్టింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కాని ఆమె మాత్రం అమృత పాత్రలో టాలీవుడ్ జనాలకు పరిచయ౦ అయింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో తన సినిమాలను బిజీ బిజీ గా చేసుకుంటుంది ఈ భామ.  త్వరలోనే టాలీవుడ్ లో మరో సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచార౦ జరుగుతుంది. 

 

ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ రోజు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ హీరోలు ఆమెకు విష్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే స్టార్ హీరో ప్రభాస్ కూడా ఆమెకు విష్ చేసాడు. సినిమా అయినా సరే ఆమెను అభిమానిస్తున్నాడు ప్రభాస్. నేటితో 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న శ్రద్ధకు పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేశారు. `సాహో` సినిమా హీరో, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా శ్రద్ధను విష్ చేశాడు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రభాస్ తాజాగా శ్రద్ధకు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేశాడు. `నా స్వీటెస్ట్ అమృత కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు` అని కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: