తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొంత మంది నటీనటులకు బాగా కలిసి వస్తుంది. పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు తర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్ క్రేజ్ సంపాందించుకున్నాడు. ఆ తర్వాత గీతా గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన టాక్సీవాల చిత్రంతో మరో ఘన విజయం సొంతం చేసుకున్నాడు. వరుసగా ఇలా హిట్స్ రావడంతో విజయ్ దేరకొండ క్రేజ్ యూత్ లో బాగా పెరిగిపోయింది. అంతే కాదు ఇతని కోసం దర్శక, నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఈ మద్య రిలీజ్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్ కాస్త నిరాశ పరిచినా ప్రస్తుతం పూరి జగ్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే. ఈ మద్య విజయ్ దేవరకొండపై బాలీవుడ్ కన్ను పడిందని అంటున్నారు. అక్కడ కూడా మనోడికి మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్.. విజయ్ని కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. పూరి సొంత బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతుండగా, నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహర్ వున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చూసి కరణ్ జోహార్ బాగా ఇంప్రెస్ అయ్యారట.. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో హిందీలో చిత్రం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ విషయాన్ని గురించి ఆయన విజయ్ దేవరకొండతో మాట్లాడటం కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ... ఇదే జరిగితే బాలీవుడ్ లో ఈ క్రేజీ హీరోకి మంచి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయం అఫిషియల్ అనౌన్స్ మెంట్ వస్తే అసలు విషయం తెలిసిపోతుంది.