తెలుగు బుల్లితెరపై జనరంజకంగా సాగుతున్న కామెడీ షో ‘జబర్ధస్త్’.  ఈ జబర్ధస్త్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు మంచి పొజీషన్లోకి వచ్చారు.  జబర్ధస్త్ లో నటించిన వారు ఇప్పుడు వెండితెరపై కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు.  జబర్ధస్త్  లో ఎక్కువగా కామెడీ పండించే వారిలో సుడిగాలి సుధీర టీమ్ తర్వాత హైపర్ ఆది టీమ్.  అదిరే అభి టీమ్ ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగారు.  ప్రస్తుతం జబర్ధస్త్  ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు లకు మంచి స్థానం ఉందన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మద్య దొరబాబు, పరదేశి వైజాగ్ లో వ్యభిచారం కేసులో పట్టబడ్డారు. 

 

అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ కమెడియన్ హాట్ టాపిక్ గా మారాడు.  ఒకదశలో జబర్ధస్త్ నుంచి దొరబాబు ని తీసేశారు అన్న వార్తలు వచ్చాయి. అయితే అసలు దొరబాబు నిజంగానే వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డాడా.. లేదు.. కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరకించారని మరికొందరు వాదిస్తున్నారు. దొరబాబు భార్య మాత్రం దొరబాబు ఏంటో నాకు తెలుసు.. దాంతో ఇప్పుడు ఈ టాపిక్ వేరే రకంగా మారింది.  తాజాగా జరిగిన సంఘటనతో మల్లెమాల టీమ్.. దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు సమాచారం.

 

దీంతో హైపర్ ఆది కలగజేసుకొని మల్లెమాల టీమ్‌తో మాట్లాడి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం.  ఎప్పటి నుంచో టీమ్ లో కొనసాగుతున్నాడని.. ఆడియన్స్ కొత్తవారికి అలవాటు కావాలంటే చాలా సమయం పడుతుందని హైపర్ ఆది కోరినట్టు సమాచారం. అయితే దొరబాబు మాత్రమే కాదు తన టీమ్ లో ఎవరైనా ఈసారి వివాదాస్పద కేసుల్లోకి వెళితే వారిని మాత్రమే కాదు హైపర్ ఆదిని కూడా జబర్ధస్త్ నుంచి సేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం.  దొరబాబు జబర్ధస్త్‌లో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటిలా తన కామెడీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: