అలనాటి అందాల నటించి శ్రీదేవి వారసురాలిగా సినీరంగానికి పరిచయం అయిన యంగ్ లేడీ జాన్వీ కపూర్. దడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది. కరోనా అవుట్ బ్రేక్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంటిలో ఉంటున్న అందాల భామ జాన్వీ తన ఎక్స్ పీరియన్స్ను అభిమానులతో పంచుకుంది.
ఈ వారం రోజులు ఇంట్లోనే ఉంటున్న ఆమె ఏం అబ్జర్వ్ చేసిందో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. `నేను ఆహారం విలువ తెలుసుకున్నాను. నాన్న నన్ను ఎంతో మిస్ అవుతున్నాడని అర్థం చేసుకున్నాను. అంతేకాదు ఒక రోజులో ఎన్నో గంటలు ఉంటాయని తెలుసుకున్నా. మా అమ్మ బెడ్ రూమ్లో ఆమె జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయని తెలుసుకున్నాను.
నా సోదరి ఖుషీ అర్ధం చేసుకునే చెల్లి అని, నేను మంచి చిత్రకారిణిని అని గ్రహించాను. కసరత్తులు చేయటంలో, ఫిజిక్ మెయిన్టైన్ చేయటంలో నాకు ఎవరి సహకారం అవసరం లేదని కూడా తెలుసుకున్నాను. జాన్వీ, ఖుషీలు అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్లన్న విషయం తెలిసిందే. జాన్వీ బాలీవుడ్ లో హీరోయిన్గా నటిస్తుండగా ఖుషీ న్యూయార్క్లో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది. లాక్ డౌన్కు కొద్ది రోజుల ముందే ఖుషీ ఇండియాకు తిరిగి వచ్చేసింది.