కియారా అద్వాని... బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. తెలుగు కియారా అద్వాని ఫస్ట్ సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకి ముందు కియారా ఎవరో అంతగా తెలీదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ తో వెంటనే మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో వచ్చిన ఆఫర్ తో అందరూ కియారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సెటిలవుతుందనే భావించారు.

 

కానీ బ్యాడ్ లక్ ఏంటో గాని వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా చరణ్ కి ఊహించని షాకిచ్చింది. బోయపాటి ఎప్పటి లాగే తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ని డిజైన్ చేసినా కాని జనాలకి ఎక్కలేదు. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కథ లో దమ్ము లేకపోవడం తో ఫ్లాప్ గా మిగిలింది. అంతే ఇక కియారా కి మళ్ళీ టాలీవుడ్ లో సినిమా ఛాన్స్ రాలేదు. స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంది కాస్తా ముంబై ఫ్లైటెక్కి వెళ్ళిపోయింది. కానీ అక్కడే కియారా కి స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుందని ఎవరూ అనుకోలేదు.

 

బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో తీసిన లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసింది కియారా. ఈ వెబ్ సిరీస్ లో కూడా రాధికా ఆప్టే, మనీషా కోయిరాల, నేహా ధూపియా, సంజయ్ కపూర్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా కూడా పాపులర్ అయింది మాత్రం కియారా నే. ఆ తర్వాత తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమాతో కియారా ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇదంతా లస్ట్ స్టోరీస్ లో చేసిన క్యారెక్టర్ తో వచ్చిన పాపులారిటీనే. అయితే ఇప్పుడు ఈ స్థాయికి వస్తుందని అప్పుడు లస్ట్ స్టోరీస్ చేసినపుడు కియారా కాదు ఏ ఒక్కరు ఊహించలేదు.

 

ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది. అక్షయ్ కుమార్ తో రెండవ సినిమా చేస్తుంది. అంతేకాదు బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కియారానే. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్ హీరోలకే డేట్స్ ఇవ్వనంతగా బిజీగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: