సాయి పల్లవి తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలు అయినా సరే ఆమెకు మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. టాలీవుడ్ లో ఒక్క సినిమాతో ఆమె ఒక ఊపు ఊపింది. ఆమె చేసిన ఫిదా సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు వందకు వంద మార్కులుపడ్డాయి. తెలంగాణా అమ్మాయి గా ఆమె చేసిన పాత్ర ఎందరికో పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇక ఆమె నోటి నుంచి వచ్చిన మాటలకు ఫిదా అయిపోయారు జనాలు. ఆ విధంగా ఆ సినిమాలో సాయి పల్లవి ఆకట్టుకుంది. 

 

ఇది పక్కన పెడితే ఆమె ఇప్పుడు తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. అంతకు ముందు ఆమె తెలుగుకి దూరంగా ఉంది. కారణం తెలియదు గాని ఇక్కడి దర్శక నిర్మాత కారణం గా ఆమె తెలుగుకి దూరంగా ఉందని అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగులో వరుసగా సినిమాలను చెయ్యాలని చూస్తుంది. ప్రస్తుత౦ ఆమె రానా తో ఒక సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు గా పూర్తి అయింది. విడుదల కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత నానీ తో ఒక సినిమా చేసే ప్లాన్ చేస్తుంది. నానీ కి ఆమెకు గతంలో విభేదాలు కూడా వచ్చాయి. 

 

ఆ తర్వాత వాటిని అందరి సమక్షంలో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల మీద అభిమానులకు ఒక ఆసక్తి ఉంది. నాగ చైతన్య తో ఒక సినిమా చేస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా పూర్తి అయింది. కాని విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  తెలుగులో ఆమె దాదాపు మూడు నుంచి నాలుగు సినిమా కథలను ఓకే చేసింది. వాటిని వచ్చే ఏడాది చెయ్యాలని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: