టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు వచ్చారు.. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తనయుడు గోపిచంద్ ఒకరు. మొదట హీరోగా పరిచయం అయినా.. పెద్దగా హిట్ కాకపోవడంతో తర్వాత జయం, నిజం, వర్షం లాంటి మూవీస్ లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలు అందుకున్నాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ ఆ మద్య లౌక్యం, సౌఖ్యం లాంటి సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. మొదటి నుంచి యాక్షన్ సినిమాలకే ఎక్కువ పరిమితం అయిన గోపిచంద్ ఆ తరహా సినిమాలతో ఎక్కువగా సక్సెస్ కాలేకపోతున్నారు. గత ఏడాది చాణక్య కాస్త పరవాలేదు అనిపించింది. అంతకు ముందు వరుసగా అపజయాలు అందుకున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవ `సీటీమార్`. సంపత్ నంది ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. `చెక్దే` ఇండియా స్ఫూర్తితో ఈ మూవీ ఫుల్బాల్ గేమ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తమన్నా జ్వాలా రెడ్డిగా పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే కీ షెడ్యూల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల సినీ పరిశ్రమ షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే.
త్వరగా కరోనా లాక్ డౌన్ పూర్తియిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టే యోచనలు ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా రెగ్యులర్ షూటింగ్ని వాయిదా వేశారు. ఇదిలా వుంటే ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హాట్ ఆటమ్ బాంబ్ ఊర్వశీ రౌతేలాని తీసుకున్నట్టు తెలిసింది. సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి, వంటి మూవీలో తన అందాలతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ మూవీ `వర్జిన్ భానుప్రియ` మూవీలో నటిస్తోంది. సీటీమార్` మూవీలో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ఈ హాట్ బ్యూటీ మరికొన్ని టాలీవుడ్ మూవీస్ పై కన్నేసిందంటున్నారు.