టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల మీద జనాలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు హిట్ కావడం తో ఇప్పుడు ఎక్కువగా దర్శకులు నిర్మాతలు హీరోలు అందరూ కూడా ఈ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హిట్ లేని వాళ్ళు కూడా ఈ ఫార్ములా ఫాలో అయి హిట్ కొట్టాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం దర్శకులను కథలను రెడీ చేయమని కూడా కోరుతున్నారు ప్రస్తుతం. ఇది ఎంత వరకు ఫలిస్తుంది అనేది పక్కన పెడితే అగ్ర హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తున్నారు. 

 

టాలీవుడ్  జనాలు అందరూ కూడా ఇప్పుడు ఈ ఫార్ములా తో హిట్ కొట్టాలి అని భావిస్తున్నారు. తాజాగా మంచు ఫామిలీ కూడా ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద దృష్టి పెడుతుంది. గతంలో మంచు హీరోలు కూడా రెండు సినిమాలను చేసారు. ఆ సినిమాలు పర్వాలేధనిపించాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములా ఫాలో అవ్వాలి అని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్ తో సినిమా చెయ్యాలి అని భావిస్తున్నారు. చిన్న చిన్న దర్శకులతోనే ఖర్చు తక్కువలో ఈ సినిమాలను చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 

 

ఇప్పటికే ఒక చిన్న దర్శకుడు కథ కూడా రెడీ చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో గాని ఈ సినిమా ఈ ఏడాది జనవరి లోనే సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉందని కాని కరోనా కారణంగా వాయిదా పడింది అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు అందరూ ఈ ఫార్ములా ను ఫాలో అవుతున్నారు. తమ సినిమాలో వేరే హీరో ని కూడా తీసుకోవాలి అని భావిస్తున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా చేస్తారు అనేది సరిగా స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: