ఇండియన్ ఫిలిం స్క్రీన్ పై ప్రస్తుతం బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. అనేక ఇండస్ట్రీలలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు బయోపిక్ సినిమాలు తీయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం చూస్తే కష్టపడి సినిమా స్టోరీ రాయక్కర్లేదు, జీవిత కథ ఆధారంగా సదరు వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలు తెలుసుకుని చాలా తక్కువ టైమ్ లోనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసి సూపర్ హిట్లు కొట్టేయవచ్చు. ఈ కారణంగా రాజకీయ రంగానికి మరియు సినిమా రంగానికి మరియు క్రీడా రంగానికి చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కించి చాలా భాషలలో రిలీజ్ చేస్తూ డైరెక్టర్లు సక్సెస్ సాధిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మరియు వైయస్సార్ అదేవిధంగా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమాలు తీసి మంచి విజయాలు సాధించారు. హిందీలో కూడా సైనా నెహ్వాల్, కపీల్ దేవ్, ధోని, సచిన్ బయోపిక్ లు డైరెక్టర్ గా తమిళంలో దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా తాజాగా 2000 సంవత్సరంలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించడమే కాకుండా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ క్రియేట్ చేసిన కరణం మల్లేశ్వరి బయోపిక్ సినిమాని తెరకెక్కించాలని సంజన రెడ్డి అనే దర్శకురాలు రెడీ అవుతోంది.
రాజుగాడు అనే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయమైన సంజనా రెడ్డి కరణం మల్లేశ్వరి బయోపిక్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తోంది. తెలుగు మరియు హిందీ లో తెరకెక్కించాలని సినిమాలో తాప్సీని నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తాప్సీకి మంచి క్రేజ్ ఉండటంతో డైరెక్టర్ సంజనా రెడ్డి ఆమెను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే తాప్సీకి స్క్రిప్టు వినిపించినట్లు సమాచారం.