సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాని అనౌన్స్ చేశాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. మొదట్లో కీర్తి సురేష్ ని తీసుకోవాలని భావించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, సాయి మంజ్రేకర్ ల పేర్లు బయటకి వచ్చాయి. వీరిద్దరిలో మహేష్ సరసన నటించే అవకాశం ఎవరికి వస్తుందనేది ఇప్పటికీ సస్పెన్సే..

 

IHG

అయితే తాజాగా సాయి మంజ్రేకర్ చేసిన కామెంట్స్ ఈ విషయంలో కొంత స్పష్టతని ఇస్తున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాటలో మీరు హీరోయిన్ గా నటిస్తున్నారని వస్తున్న వార్తల విషయమై స్పందించిన సాయి మంజ్రేకర్, అసలు ఇలాంటి వార్త ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు. ఇప్పటి వరకూ ఈ విషయమై నన్నెవరూ సంప్రదించలేదని బదులిచ్చింది. అయితే అంతటితో ఆగిపోతే క్లియర్ అయిపోయేదే.

 

 

కానీ ఆ తర్వాత ఆమె మాట్లాడిన మాటలు అనేక అనుమానాల్ని రేపుతున్నాయి. సాయి మంజ్రేకర్ వాళ్ల తల్లిదండ్రులు నమ్రతకి చాలా క్లోజ్ అట. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. దీంతో సర్కారు వారి పాటలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా మహేష్ సినిమా వ్యవహారాలన్నీ నమ్రతే చాలా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తుంది. అందువల్ల హీరోయిన్ ఎంపికలో కూడా ఆమె కలుగజేసుకునే ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు.

 

 

సాయి మంజ్రేకర్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఆమె తండ్రి మహేష్ మంజ్రేకర్ తెలుగులో చాలా సినిమాల్లో నటించాడు. ఎన్టీఆర్ అదుర్స్, గోపీచంద్ ఒక్కడున్నాడు వంటి చిత్రాల్లో విలన్ గా మెప్పించాడు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: