టాలీవుడ్ లోనే కాదు తమిళం లో కూడా సూపర్ హిట్ అయిన సినిమా... నరసింహ. ఈ సినిమాలో ప్రధానంగా రమ్యకృష్ణ నటన తో పాటుగా ఈ సినిమాలో రజిని కాంత్ నటన అన్నీ కూడా ఒక సంచలనంగా చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర అలాగే హీరోయిన్ గా ఉన్న రమ్యకృష్ణ విలన్ గా పోషించిన పాత్ర కూడా ఎవరూ చేయలేరు అనే విధంగా ఉంటుంది అని చెప్పాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన చూసిన టాలీవుడ్ అయితే షేక్ అయింది అనే చెప్పాలి. ఆమె ఆ రేంజ్ లో నటించి మెప్పించారు అని చెప్పవచ్చు. 

 

ఈ సినిమాలో ఆమె చేసే అజ్ఞాత వాసం అన్నీ కూడా సినిమాకే హైలెట్ గా నిలిచాయి. తాను ప్రేమించిన వాడు దూరం అయ్యాడు తన పని మనిషికి దగ్గర అయ్యాడు అనే బాధ లో ఆగ్రహం లో కోపం లో ఆమె దాదాపు 20 ఏళ్ళ పాటు అదే గదిలో ఉంటుంది. ఇక ఆ పెళ్లి సీడీ ని ఆమె పదే పదే  చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆమె అజ్ఞాతవాసం నుంచి బయటకు వస్తుంది. అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చిన సమయంలో... తన అన్న కొడుకు నరసింహం కూతురు ని ప్రేమిస్తాడు అనే విషయం తెలుసుకున్న ఆమె... 

 

ఎలా అయినా సరే తాను పడిన బాధ  ఆమె అన్న కొడుకు కూడా పడాలి అని చెప్పి  నరక౦ చూపించాలి దూరం చెయ్యాలి అని భావిస్తుంది. అంతక ముందే వేసిన ప్లాన్ ని ఆమె అమలు చేసి అప్పుడు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చి రజనీ కాంత్ ముందు... నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారి అని... నా దారి కూడా అదే అని ఆమె చెప్పిన సన్నివేశం ఇండియన్ సినిమాను ఊపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: