ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... చాలా కాలం తరువాత గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఒక పాన్ ఇండియా చిత్రం..! ఛార్మీతో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కరణ్ జోహార్ కూడా సహానిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం పూర్తయ్యాక పూరి… కరణ్ జోహార్ తో కలిసి మరికొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడట.

హిందీలో కూడా పూరి సినిమాలకు మంది డిమాండ్ ఉంది. అక్కడ అమితాబ్ తో స్ట్రెయిట్ సినిమా కూడా చేసి హిట్టు కొట్టాడు పూరి..! అందుకే కరణ్ జోహార్ ఇతని పై నమ్మకం పెంచుకుంటున్నట్టు తెలుస్తుంది. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే… గత కొద్ది రోజులుగా పూరి జగన్నాథ్, ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ తో తన డ్రీం ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ ను తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే పూరి… యష్ తో సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్న వార్త మాత్రం వాస్తవమే.

అది పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించే ఉద్దేశంతో పూరి ఉన్నారనే వార్త కూడా నిజమేనట. కానీ అది ‘జన గణ మన’ అనే వార్త మాత్రం నిజం కాదట. పూరి ఇంకా యష్ ను కలిసి కథ చెప్పలేదట. స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజిలో ఉన్నాయట. అది ఓకే అయిన తరువాతే పూరి.. యష్ ను కలిసే అవకాశం ఉందని సమాచారం. ఇక జనగణమన మహేష్ తో చెయ్యాలని పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో ఆశ పడుతున్నాడు.  ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...ఇలాంటి ఆసక్తికరమైన వార్తలను చదవండి...

మరింత సమాచారం తెలుసుకోండి: