‘అల వైకుంఠ పురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినప్పటికీ త్రివిక్రమ్ కష్టాలు తీరడంలేదు సరికదా మరింత పెరుగుతూనే ఉన్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ మూవీ రాబోతున్న దసరా రోజున ప్రారంభం అయి ఉండేది.


అయితే కరోనా పరిస్థితులు వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ పరిస్థితి అయోమయంగా మారడంతో త్రివిక్రమ్ జూనియర్మూవీ నిరవదికంగా వాయిదా పడింది. ‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి అయితేకాని జూనియర్ త్రివిక్రమ్ వైపు చూడడు. ఇలాంటి పరిస్థితులలో ‘కేజీ ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈమధ్య జూనియర్ ను రెండుసార్లు కలవడంతో పాటు ఒక పవర్ ఫుల్ కథ విషయమై లోతుగా చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలు త్రివిక్రమ్ దృష్టి వరకు వచ్చినట్లు తెలుస్తోంది.



ఒకవేళ జూనియర్ ప్రశాంత్ నీల్ పై ఉన్న మోజుతో ముందుగా అతడి కథకు ఒకే చెప్పి తనను మరికొంత కాలం హోల్డ్ లో పెడతాడా అన్న సందేహం త్రివిక్రమ్ ను వెంటాడుతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ జూనియర్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా అలాంటి పరిస్థితి రాకపోవచ్చని త్రివిక్రమ్ కు నమ్మకం ఉన్నప్పటికీ జూనియర్ ప్రశాంత్ నీల్మూవీ గురించి ఎందుకు తరుచూ వార్తలు వస్తున్నాయి అన్న అనుమానం త్రివిక్రమ్ మనసులో ఉంది అని అంటున్నారు.


వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ తో జత కట్టడానికి ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ అలా చేస్తే జూనియర్ హర్ట్ అవుతాడు అన్న కారణంతో త్రివిక్రమ్ మహేష్ రాయబారాలకు స్పందించడం లేదు అని అంటారు. అయితే జూనియర్ మాత్రం తాను త్రివిక్రమ్ తో చేయవలసిన మూవీ ఇంకా మొదలు కాకుండానే ప్రశాంత్ నీల్ తో ఎందుకు చర్చలు చేస్తున్నాడు అన్న విషయం పై ప్రస్తుతానికి ఇండస్ట్రీ వర్గాలలో సమాధానం లేని ప్రశ్నగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: