టాలీవుడ్ లో పూజా హెగ్డే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూజా హెగ్డే చాలా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే పూజా హెగ్డే మాత్రం వాటిని కాస్త ఈ మధ్యకాలంలో లెక్కచేయడం లేదు అని ఆరోపణలు వినపడుతున్నాయి. మంచి మంచి అవకాశాలు వచ్చిన సమయంలో ఆమె దురుసు ప్రవర్తన కారణంగా కొన్ని అవకాశాలను కోల్పోతుందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమెకు మహేష్ బాబు సినిమా విషయంలో ఇదే జరిగింది అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు .

వాస్తవానికి సర్కారు వారి పాట సినిమాలో ఆమెను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ పూజా హెగ్డే మాత్రం సినిమాకు 7 కోట్ల వరకు డిమాండ్ చేయడంతో చిత్రయూనిట్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో హీరోలు కూడా పారితోషికం తగ్గించుకుని ఉన్న తరుణంలో ఆమె మాత్రం భారీగా డిమాండ్ చేయడంతో అవసరం లేదని పక్కన పెట్టినట్టుగా సమాచారం. ఇలాంటి చర్యల ద్వారా అనవసరంగా ఇతర హీరోలకు ఆమె అంటే ఒక అభిప్రాయం ఏర్పడుతుందని ఇది మంచిది కాదు అని సూచిస్తున్నారు.

ఇక రష్మిక మందన కూడా దాదాపుగా ఇదే విధంగా వ్యవహరిస్తుంది. రష్మిక మందనను మహేష్ బాబు సినిమాలో తీసుకోవాలని  భావించగా... గత సినిమాల్లో వచ్చిన విజయాల కారణంగా ఆమె ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలు పెట్టిందట. దీనివలన నిర్మాతలు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా నిర్మాతలు వీరిద్దరినీ పక్కన పెట్టే అవకాశాలు ఉండవచ్చు. ఇక మహేష్ బాబు సినిమాలో పూజా హెగ్డే ని తీసుకోవాలని భావించి ఆమెను పక్కన పెట్టి కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. స్వయంగా మహేష్ బాబు కీర్తి సురేష్ తన కొత్త సినిమాలో హీరోయిన్ గా ప్రకటించారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: