టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ నటిగా మంచి అవకాశాలు పేరు క్రేజ్, పాపులారిటీ కొనసాగుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. తొలిసారిగా కెరటం అనే సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రకుల్. ఆ తర్వాత గోపీచంద్ సరసన ఆమె నటించిన లౌక్యం అలానే సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలు రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర అత్యద్భుత విజయాన్ని అందుకొని నటిగా రకుల్ కి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. ఇక అక్కడి నుండి వరుసగా సినిమా అవకాశాలతో కొనసాగిన రకుల్ పలు విజయాలను సొంతం చేసుకుని తన ఆకట్టుకునే అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

అయితే ఆ తర్వాత కెరీర్ పరంగా రకుల్ కొంత ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ బాబు స్పైడర్ అలానే రాంచరణ్ బ్రూస్ లీ సినిమాలు రెండూ కూడా అప్పట్లో పరాజయంపాలై రకుల్ కి కెరీర్ పరంగా కొద్దిపాటి ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు మాత్రం పెద్దగా తగ్గలేదు. కాకపోతే ఆ తర్వాత కూడా ఆమె కొంత పరాజయాలు ఎదుర్కోవడంతో మధ్యలో కొన్ని నెలలు ఆమె చేతిలో సినిమాలు లేవు అనేటువంటి వార్తలు ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. ఇకపోతే వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ నేడు రకుల్ ప్రీత్ సింగ్ టీం అఫీషియల్ గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

ఇప్పటికే రకుల్ చేతిలో ఉన్న తెలుగు, తమిళ, హిందీ సినిమాల వివరాలు వారు విడుదల చేశారు. కాగా వాటిలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు సినిమా విషయం ప్రస్తావించకపోవడంతో ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు అనేటువంటి చర్చ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో కొనసాగుతోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో మరొక నటి కాజల్ అగర్వాల్ తో సహా రకుల్సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. మరి ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఎటువంటి సమాచారం వెల్లడి కాకపోవడంతో ఆమె నిజంగానే ఆ సినిమా నుంచి తప్పుకున్నారని అయితే అది కేవలం కాల్షీట్ సమస్య వల్లనేనని కొందరు అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ఈ సినిమా విషయమై మాత్రం రకుల్ నుండి అఫీషియల్ గా న్యూస్ బయట రావాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: