ఇటీవల కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ఎక్కడికక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని నెలల పాటు లాక్ డౌన్ చేయబడిన విషయం తెలిసిందే. దానితో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లకు పూర్తిగా పరిమితమై ఉండిపోవాల్సివచ్చింది. దీనివల్ల అన్ని రంగాలు మూతబడి చాలావరకు నష్టాల బాట పట్టాయి. ముఖ్యంగా కోట్లాదిమంది దిగువ వర్గాలకు చెందిన ప్రజలు తినడానికి సరైన తిండి లేక చేయడానికి పనులు లేక నానా అవస్థలు అనుభవించసాగారు.

మొత్తానికి ఇటీవల మెల్లగా ఒక్కొక్క విడతగా లాక్ డౌన్ ని ఎత్తివేస్తూ వచ్చాయి పలు ప్రభుత్వాలు. ఇక మన దేశంలో కూడా ఎందరో  ప్రజలు తిండికోసం అలమటించి పోయారు. కాగా అటువంటి వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సాయం అందించడం జరిగింది. మరోవైపు సినిమారంగం సహా పలువురు ఇతర రంగాల ప్రముఖులు ముందుకు వచ్చి తమ దయార్ద్ర హృదయం తో విరాళాలు కూడా అందించడం జరిగింది. ఇక సినిమా  పరిశ్రమ నుంచి సోను సూద్, ప్రకాష్ రాజు వంటి వారు తమకు వీలైనంతలో తమ వద్ద పనిచేస్తున్న వ్యక్తులకు అలానే అన్నం కోసం అల్లాడే అన్నార్తులకు మెరుగ్గా సహాయాలు, దానాలు చేస్తూ కొనసాగుతున్నారు.

ఇటీవల కొన్నాళ్లుగా సోనూసూద్ తనవంతుగా దానాలు చేస్తూ కొనసాగుతుంటే ప్రస్తుతం తమిళనాడుని నివర్ తుఫాన్ కుదిపేస్తు ఉండటంతో తమ టీం సహాయంతో నటుడు ప్రకాష్ రాజ్ పలువురు  ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకుని వారిని వసతిగృహాలకి తరలించి వారికి భోజనం సహా పలు రకాల ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలను తమ వంతుగా ఆదుకుంటూ గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్, ప్రకాష్ రాజ్ ఇద్దరిపై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తూ మీ ఇద్దరూ ఇద్దరే, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు స్వామి మీవంటి వారు ఎందరికో ఆదర్శం అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: