దేశం గర్వపడే దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సూపర్ డైరెక్టర్  దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి' సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి  దుమ్ముదులిపిన సంగతి తెలిసిందే. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌ని మలుపుతిప్పిన చిత్రంగా నిలిచింది.పక్క ఊర మాస్ మూవీ గా తెరకెక్కింది. టాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ సాధించి కాసుల వర్షం కురిపించింది. అయితే ఇన్నేళ్లకు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ పవర్‌ఫుల్ సినిమాతో తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

తాజాగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు కూడా."అల్లుడు శీను" సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన మాస్ డైరెక్టర్  వీవీ వినాయక్ ఈ `ఛత్రపతి` హిందీ రీమేక్‌కు దర్శకత్వం వహించనుండటం విశేషం. ఇటు బెల్లంకొండకు అటు వీవీ వినాయక్‌కు ఇద్దరికీ ఇదే తొలి హిందీ సినిమా కానుంది.కాబట్టి ఈ సినిమాతో తన మునుపటి మాస్ వైభవం కోసం తెగ కష్టపడుతున్నాడట.  పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి జయంతిలాల్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అప్పుడు తెలుగు ఛత్రపతి కి కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం.ఈయన కూడా వివి వినాయక్, బెల్లంకొండ కి మంచి బ్రేక్ ఇవ్వటం కోసం కథని ఇంకా అద్భుతంగా చెక్కటానికి చాలా కష్టపడుతున్నాడట.

టాలీవుడ్‌లో ఊర మాస్ రేంజ్ లో ఘన విజయం  సాధించిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌లో నటించే అవకాశం రావడం పట్ల బెల్లంకొండ చాలా హ్యాపీగా ఉన్నాడట. ఈ మూవీతో తన బాలీవుడ్ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని బెల్లం బాబు చాలా నమ్మకంగా వున్నాడట. అలాగే తనను 'అల్లుడు శీను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్నందుకు పట్ల  చాలా సంతోషంగా  వున్నాడట. అతి తొందరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ ప్రకటించనున్నారని సమాచారం అందుతుంది... ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: