యంగ్
హీరో రానా అనారోగ్యం గురించి చర్చ జరుగుతోంది. అయితే రానా. అమెరికాలో చికిత్స చేయించుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అయితే తనకు గుండెపోటు వచ్చేందుకు 70శాతం ఛాన్సెస్ ఉన్నాయని
డాక్టర్ చెప్పారంటూ ఓ కార్యక్రమంలో
రానా చెప్పడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
అరణ్య షూటింగ్ టైమ్ లో
రానా అనారోగ్యం గురించి అసలు విషయం బయటపడింది. ఓ లెన్స్ ధరించేందుకు కంటికి ఆపరేషన్ చేయించుకున్న
రానా బీపీ చూస్కుని షాక్ తిన్నాడట. డాక్టర్లు అన్ని టెస్టులూ చేసి 220/192 బీపీ ఉందని ఒక మనిషికి ఉండాల్సిన బీపీ
కన్నా రెండు రెట్లు అధికంగా ఉందని అన్నారట. సీన్ అర్థమై వెంటనే నాన్న(సురేష్ బాబు)తో కలిసి చికిత్సకు అమెరికాకు వెళ్లాడట.
అమెరికాలో
డాక్టర్ పుట్టుకతోనే తనకు అత్యధిక రక్తపోటు ఉన్నా ఎవ్వరూ దాన్ని గుర్తించలేకపోయారని.. దాని వల్ల శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయని షాక్ మీద షాకిచ్చారట డాక్టర్.
గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయింది. కిడ్నీలు పాడైపోయాయి.
ఆరు నెలల్లో ఇది జరగొచ్చు అని షాకిచ్చారట.ఆ దెబ్బకు నాన్ వెజ్.. ఆల్కహాల్
సిగరెట్ అన్నిటినీ మానేశాడు. ఒక్కరోజులో అన్నీ మార్చేశానని
రానా కన్నీటిపర్యంతమవుతూ తన ఆరోగ్య సమస్యను వివరించారు. సరైన సమయంలో సరైన చికిత్సతో
రానా బయటపడ్డారు. ఇది అందరికీ సంతోషం.