అనుష్క శెట్టి నటించిన సూపర్ హిట్ సినిమా భాగమతి.  తెలుగులో అశోక్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ నిర్మాతగా ఈ సినిమాని బాలీవుడ్ లో అశోక్ కుమారే తెరకెక్కించారు. భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా దుర్గామతి అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా భూమి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికి కారణం ఈ సినిమాలో ఆమె అనుష్క పాత్రలో నటించడంతో ఈమె నటనను అనుష్క నటన తో పోలుస్తూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.

 తనను అనుష్కతో పోల్చటం మీద ఆమె స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది అదేమిటంటే అనుష్కకు ఫ్యాన్ ఫాలోయింగ్ తన కంటే చాలా ఎక్కువ అని ఆమె చెప్పుకొచ్చింది. సో ఆమె ఫాన్స్ ఆమె లాగే తాను కూడా నటించాలని కోరుకుంటారని అందులో తప్పేమీ లేదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇది రీమేక్ సినిమా కావడంతో అంతా కొత్తగా చేయడానికి ప్రయత్నించారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తాను మాత్రమే కాక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో నటించామని చెప్పుకొచ్చింది.

ఒరిజినల్ సినిమా లో ఉన్నది ఉన్నట్టు చేయడానికి మళ్ళీ ఈమె ఎందుకు అని ఫీల్ అవుతారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా ఒరిజినల్ సినిమా అని తాను చూశానని అందులో అనుష్క నటన చాలా బాగుందని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి రోల్ చేయటం అనేది ప్రతి ఒక్క నటికీ ఒక డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 11న ఆమెజాన్ ప్రైం లో విడుదల కానుంది. ఇప్పటికే హారర్ జానర్లో ఒటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ సరిగా ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ సినిమా అయినా ఆకట్టుకుంటుందో లేదో అనేది వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: