అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కలకలం మొదలైంది. దానికి కారణం అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో ఒక టెక్నీషియన్ కరోనా కారణంగా చనిపోవడమే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు పుష్ప యూనిట్లో ఒక కీలక టెక్నీషియన్ కరోనా కారణంగా మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా యూనిట్ అంతా అప్పటికప్పుడు షూటింగ్ పేకప్ చెప్పేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారని తెలుస్తోంది. దాదాపు అందరూ కరోనా టెస్ట్ చేయించుకున్నారని తెలుస్తోంది. 


ఈ టెక్నీషియన్ డైరెక్టర్ తో సహా చాలామందికి డైరెక్ట్ కాంటాక్ట్ గా ఉన్నాడని అందుకే ఈ యూనిట్లో టెన్షన్ మొదలైంది అని అంటున్నారు. అయితే హీరో తో డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా ఇతర క్రూ మెంబర్స్ తో ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ అయి ఉండొచ్చని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి దర్శకుడు సుకుమార్ సహా నిర్మాతలు వెనక్కి వచ్చేశారు అని అంటున్నారు అయితే అల్లు అర్జున్ సంగతి అయితే తెలియ లేదు. 


అయితే ఫ్యాన్స్ లో టెన్షన్ గా ఉండడానికి కారణం ఈ వారంలోనే గోవాలో నిహారిక - చైతన్యల పెళ్లి ఉంది. ఇప్పుడు కరోనా ఐసోలేషన్ లోకి వెళ్ళిన ఆయన పెళ్లి కి హాజరు కాలేక పోవుచ్చని అంటున్నారు. అయితే ఈ అంశం మీద నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రచారమయితే జోరుగా సాగుతుండగా ఇందులో నిజమెంత అనేది సినిమా యూనిట్ ఏదైనా క్లారిటీ ఇస్తే గాని తెలియలేదు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 











 


 


మరింత సమాచారం తెలుసుకోండి: