సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనదైన స్టైల్లో నటిస్తూ ప్రేక్షకుల నుంచి మంచి పేరు సంపాదించుకున్నాడు.  సమాజానికి మంచి సందేశం ఇచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ హీరో పూర్తి విజయం సాధించాడు. పోయిన ఏడాది కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మాంచి హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో గీత గోవిందం ఫేమ్ పరశురాం కాంబినేషన్ లో ‘సర్కారు వారి పాట’ సినిమాను తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
ఇటీవలె ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నారు. అతి త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది.  అయితే ఈ ‘సర్కారు వారి పాట’ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే  ఆర్థిక మోసాలను బయటపెట్టే కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం.  ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న ఈ సినిమా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే  ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అందుకోసమే బాలీవుడ్ నటీనటులను కూడా ఈ సినిమాలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా కథ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండే కథాంశంగా ఉండబోతోందన్న వార్తలు కూడా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి . కాగా ఈ హీరో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు కూడా చేయలేదు. ఈ సినిమా ఆ రేంజ్ లో ఉండబోతోందన్న వార్తలు విన్నప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు. అదే విధంగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మాత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతుందని ప్రిన్స్ అభిమానులు ఆశిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: