మాస్ మహారాజా రవితేజ 2021 సంవత్సరంలో సంక్రాంతికి వచ్చిన క్రాక్ ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కిలాడీ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన క్రాక్ సినిమా రవితేజకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. మాస్ మహారాజా రవితేజ సినిమాలలో తనదైన శైలిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అలాగే అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. సినిమాలలో  మాస్ మహారాజా రవితేజ అంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.


 క్రాక్ సినిమా తర్వాత ఊపందుకున్న రవితేజ కిలాడి సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాట రవితేజ నక్కిన త్రినాథరావు తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.  ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ నుండి  మొదలు కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉందట అందులో భాగంగా ఒక హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ వచ్చిందని చెప్పొచ్చు.

 ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాస్సన్ నటించింది. ఆమెకు మంచి కామ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాతి వాటిని అన్నింటిని దాచుకుంటూ ఇప్పుడు భారీ హిట్ గా అవతరించింది. రవితేజ పోతురాజు వీర శంకర్ గా ఆధరగొట్టాడు. బీ మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.


ఇక మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న రమేష్ వర్మ కిలాడీ గురించి మాట్లాడితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. రమేష్ వర్మ తమిళ్ రాక్షసం అనే సినిమాకు తెలుగు రీమేక్ వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదే కాంబినేషన్లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి చిత్రంలో హీరో పాత్ర తో సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: