క్రాక్ సినిమా తర్వాత ఊపందుకున్న రవితేజ కిలాడి సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో పాట రవితేజ నక్కిన త్రినాథరావు తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికార ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదలు కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉందట అందులో భాగంగా ఒక హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ వచ్చిందని చెప్పొచ్చు.
ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. చెప్పాలంటే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాస్సన్ నటించింది. ఆమెకు మంచి కామ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాతి వాటిని అన్నింటిని దాచుకుంటూ ఇప్పుడు భారీ హిట్ గా అవతరించింది. రవితేజ పోతురాజు వీర శంకర్ గా ఆధరగొట్టాడు. బీ మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
ఇక మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న రమేష్ వర్మ కిలాడీ గురించి మాట్లాడితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. రమేష్ వర్మ తమిళ్ రాక్షసం అనే సినిమాకు తెలుగు రీమేక్ వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదే కాంబినేషన్లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా మీనాక్షి చౌదరి డింపుల్ హయాతీ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి చిత్రంలో హీరో పాత్ర తో సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేశారు.