అయితే దీని తరువాత కొరటాల శివ తో మరొక భారీ ప్రాజక్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. ప్రముఖ సంస్థలు యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ వారు నిర్మించనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుండగా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దీనికి సంగీతం అందించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అయితే అసలు విషయం ఏమిటంటే వచ్చే నెల మొదటి వారంలో ఈ మూవీ అధికారిక పూజా కార్యక్రమాలు జరగనుండగా ఆ వేడుకకి ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ వేడుకకి సూపర్ స్టార్ మహేష్ కూడా స్పషల్ గెస్ట్ గా రానున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే మహేష్ ని కలిసిన ఎన్టీఆర్, కొరటాల ఆయనని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారట. ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా దర్శకనిర్మాతలు ఎంతో గ్రాండ్ లెవెల్లో తీయనున్న ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వీలైనంత త్వరలో పూర్తి చేసి వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.