బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్ బీర్ కపూర్ తాజాగా షంషేర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ మూవీ కి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా,  ఈ మూవీ లో వాణి కపూర్ , సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా చిత్ర బృందం ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా తాజాగా చిత్ర బృంద విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా కథ 1800 కాలం నాటి నేపథ్యంలో  ఉండనునట్లు సమాచారం. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై హిందీ తో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో నటించినందుకు గాను రన్ బీర్ కపూర్ మరియు సంజయ్ దత్ లకు భారీ పారితోషకం ముట్టినట్లు ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... రన్ బీర్ కపూర్ కు ఈ సినిమా కోసం చిత్ర నిర్మాణ సంస్థ ఏకంగా 20 కోట్ల పారితోషికాన్ని ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ కనిమా కోసం సంజయ్ దత్ కు 8 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరు ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ ను అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: