పవిత్ర లోకేష్ టాలీవుడ్ సీనియర్ నటుడైన నరేష్ తో సహజీవనం చేస్తోంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా సరే వీరిద్దరూ కలిసి వెళ్లడం, కలిసి కనిపించడంతో వీరిద్దరి వ్యవహారం పై పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోని వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అని వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. దీంతో నటుడు నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరింత రచ్చ గా మారిపోయింది. కానీ పవిత్ర లోకేష్ మాత్రం తనని బ్యాడ్ చేయడానికి ఇలా చేస్తోంది ఆమె అంటూ ఆరోపణలు చేస్తోంది.
ఈ విషయంలో తనని నరేష్ ని మాత్రం అందరూ సపోర్ట్ చేయాలని కోరింది నటి పవిత్ర. అయితే మైసూర్ లో ఒక హోటల్ గదిలో నరేష్, పవిత్ర కలిసి ఉండడంతో మీడియా సమక్షంలో రమ్య వారిద్దరితో వాగ్దానం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో తెలుగులో స్టార్ హీరో హీరోయిన్లకు తల్లి లేదా అత్త పాత్రలో కనిపించే ఈ నటి తాజాగా ఈ విషయంతో ఊహించని విధంగా షాక్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నటీనటులు సైతం ఈమెతో షూటింగ్ చేయడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో అలాంటి పాత్రలు ఆమెను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పలు సినిమాల నుంచి ఈమె కోల్పోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.