పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపుగా భీమ్లా నాయక్ మూవీ తో పాటే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ  షూటింగ్ ను కూడా ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' మూవీ పై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ను పెట్టడం,  అలాగే హరిహర వీరమల్లు మూవీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమాను తెరకెక్కించడం తో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు వాయిదా పడింది.

కొన్ని రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. కొంత భాగం షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ గా తిరుగుతూ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం కాదు అని ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. దానితో హరిహర వీరమల్లు సినిమా ఇప్పట్లో విడుదల కావడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు.

కాకపోతే ప్రస్తుతం హరిహర వీరమల్లు మూవీకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే ... హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని  ఆగస్ట్  11 వ తేదీ నుండి ప్రారంభించాలని క్రిష్ జాగర్లమూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆగస్ట్ 11 వ తేదీ నుండి చక చక ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని కూడా క్రిష్ జాగర్లమూడి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఫుల్ ఖుషి లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: