నేషనల్ క్రష్ రష్మిక మందన్న దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు డిమాండ్ ఉన్న నటీమణి. పుష్ప సిరీస్ తో ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన‌ రష్మిక.. ప్రస్తుతం అటు సౌత్ తో పాటు ఇటు నార్త్ లోనూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా సత్తా చాటుతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది. అయితే రష్మిక క్రేజ్ కు ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కి సంబంధం లేకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది.


2024 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప 2 సినిమాకుగానూ రష్మిక రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వరుస విజయాలు నేపథ్యంలో రష్మిక రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ పుష్ప 2 తర్వాత వచ్చిన మూడు చిత్రాలకు ఆమె రెమ్యునరేషన్ గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో `చావా` మూవీతో రష్మిక బాలీవుడ్ లో బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికిగాను ఆమెకు రూ. 4 కోట్లు చెల్లించారు.


ఆ తర్వాత `సికిందర్‌`లో యాక్ట్‌ చేసినందుకు రూ. 5 కోట్లు రష్మిక పారితోషికంగా అందుకుంది. ఇక తాజాగా `కుబేర` మూవీతో రష్మిక ప్రేక్షకులను పలకరించింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ధనుష్‌, నాగార్జున మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ. 4 కోట్లు. పుష్ప 2 తో పోలిస్తే రష్మిక ప్రస్తుత రెమ్యునరేషన్ లో దాదాపు 60 శాతం కోత పడిందని ప‌లు నివేదిక‌లు సూచిస్తున్నాయి. మరి ఇందుకు గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: