బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సామాన్యుల నుండి సెలెబ్రిటీల దాకా అందరూ బిగ్ బాస్ ని ఫాలో అవుతున్నారు. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఫ్యాన్ అవుతున్నారు. అయితే చాలా మంది సెలెబ్రిటీలు తమకు బిగ్ బాస్ లో నచ్చిన కంటెస్టెంట్ గురించి మాట్లాడుతుంటారు. కంటెస్టెంత్స్ తరపున ప్రచారం కూడా చేస్తున్నారు. తాజాగా యాంకర్ రవి బిగ్ బాస్ షో  పై స్పందించాడు. యాంకర్ రవి, శ్రీముఖిలు కలిసి ఎన్నో షోస్ చేశారు.


వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే పటాస్ ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది గత కొన్ని రోజులుగా వీరిద్దరి స్నేహం చేడిందని, అందుకే శ్రీముఖి పటాస్ ని వదిలి బయటకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా యాంకర్ రవి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలని నిజం చేసేలా కనబడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని అడిగినపుడు ఆలీ ఎలిమినేట్ అవ్వకుంటే అతనే నచ్చేవాడు.


ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి చెప్పాలంటే కొద్ది సేపు ఆలోచించాలనీ, బిగ్ బాస్ ని ఎక్కువగా ఫాలో అవ్వట్లేదనీ, ప్రస్తుతం ఉన్నవారిలో  బాబా భాస్కర్, వరుణ్, రాహుల్ ల గురించి ఎక్కువగా వినిపిస్తుందని షాక్ ఇచ్చాడు. తనతో అన్ని సంవత్సరాలు కో యాంకర్ గా చేసిన శ్రీముఖి పేరు చెప్పకపోవడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు.కనీసం మాట వరుసకైనా ఆమె పేరు చెప్తే బాగుండేది కదా అని అనుకుంటున్నారు.


ముగ్గురి పేర్లలో తనతో కలిసి షోస్ చేసిన శ్రీముఖి పేరు లేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే వార్తలు నిజం అని స్పష్టంగా తెలుస్తుంది. రవి ఇలా చెప్పడంతో సోషల్ మీడియాలో శ్రీముఖిపై సెటైర్లు పడుతున్నాయి. మరి శ్రీముఖిని అభిమానించే వారు ఏం చేస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: