పవన్ కళ్యాణ్ పై మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు.  పవన్ కళ్యాణ్ లాగా శ్రమ దానం చేయటంలో ఇదొక కొత్త ట్రెండ్ అని..  సరిగ్గా ఒక నిమిషం 8 సెకన్లు శ్రమదానం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవా చేశారు.  కెమెరా, యాక్షన్ లాంటి వైఖరి కాదా ?  ? మహాత్మా గాంధీ జయంతి రోజున వైసీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు అనటం ఆశ్చర్యం కలిగించిందని వెల్లడించారు.  వైసీపీ మీద యుద్ధం దేని కోసం ప్రకటించారని.. కోవిడ్ కష్టకాలంలో కూడా లక్ష కోట్ల రూపాయలు నేరు గా పేదవారి ఖాతా ల్లో జమ చేసినందుకు యుద్ధం ప్రకటించారా? అని నిప్పులు చెరిగారు  మంత్రి కన్నబాబు.  

నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు అందిం చేందుకు జగన్ తాపత్రయ పడుతున్నందుకు  యుద్ధం ప్రకటించారా ? అని ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున జగన్ కు మద్దతు ఇస్తున్నందుకు యుద్ధం ప్రకటించారా? అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కడుపు మంటగా ఉందన్నారు.

 ఏ స్థాయి యుద్ధం కావాలని ప్రశ్నించటం గాంధీ మాటలా? గాడ్సే మాటలా ? కుల, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్... ఇప్పటి వరకు ఒక్కసారైనా కులం పేరు ఎత్తకుండా మాట్లాడ లేదని వెల్లడించారు  మంత్రి కన్నబాబు .  ఎవరు మాట్లాడుతున్న మాటలు, ఎవరు మాట్లాడిస్తున్నారని.. కమ్మ సామా జిక వర్గాన్ని వర్గ శత్రువుగా చూస్తున్నారంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో చంద్రబాబుతో కలిసి పని చేస్తారని సంకేతాలు స్పష్టంగా ఇచ్చారని.. 2014లో బహిరంగంగా, 2019లో లోపాయకారిగా చంద్రబాబుతో చేతులు కలిపారన్నారు  మంత్రి కన్నబాబు .  కులాలను ఎగదోసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు  మంత్రి కన్నబాబు .

మరింత సమాచారం తెలుసుకోండి: