అసలు వైసీపీలో కమ్మ నేతలు తక్కువగానే ఉంటారని చెప్పొచ్చు. తక్కువ మంది ఉన్నా సరే వైసీపీ గాలిలో ఆరుగురు కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి విజయం సాధించారు. టీడీపీలో కమ్మ వర్గానికి చెందిన నేతలకు చెక్ పెట్టడానికే ఆయా నియోజకవర్గాల్లో జగన్ కూడా కమ్మ నేతలని నిలబెట్టి సక్సెస్ అయ్యారు. అలా ఆరు చోట్ల కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సరే ఆయన, పెదకూరపాడు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఆయనకు ఈ రెండున్నర ఏళ్లలో ప్రజా మద్ధతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు విషయంలో మాత్రం ప్రజలు అంత పాజిటివ్ గా లేరని తెలుస్తోంది. అటు టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీలకు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగానే ఉంది.