నెల్లూరు జిల్లా అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది సినిమా మరియు  రాజకీయాలు. సినిమా రంగంలో ఈ  జిల్లాకు చెందిన వారు ఏంతోమంది జాతీయ స్థాయి లో మంచి  గుర్తింపు పొందారు. రాజకీయాల్లోకి వస్తే ఉమ్మడి మద్రాస్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయాలను శాసించిన రాజకీయ   ఉద్ధండులకు నిలయమైన నెల్లూరు జిల్లా లో  శ్రీనివాస్ మహల్ రాజయ్య గారి గురించి తెలుసుకోవాలి . అసలు ఇంతకీ ఏవరు ఈ శ్రీనివాస్ మహల్ రాజయ్య? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అతని పాత్ర ఏమిటి ?

"శ్రీవాస్ మాహల్ రాజయ్య " గా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు  ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అల్లిపురం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరు తొలుత ఆనాటి దిగ్గజ రాజకీయ నాయకుడైన ఏ.సి. సుబ్బారెడ్డి గారి అనుచరుడిగా ఉంటూనే యువనేత గా జిల్లా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు, ఏ.సి ఆదేశాల మేరకు నల్లమోతు చెంచు రామానాయుడు గారి తరుపున క్షేత్ర స్థాయి లో పనిచేసి ఆయన్ని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కుర్చోబెట్టడం లో కీలకంగా కృషి చేశారు .

ఏ.సి సుబ్బారెడ్డి గారి మరణాంతరం ఆనం కుటుంబంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు కారణంగా వారిని విడినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఆనం కుటుంబ రాజకీయ నియంతృత్వ పోకడకు వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో వారి వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహించారు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జిల్లాలో ఆనం కుటుంబ రాజకీయ ఒత్తిడిని తట్టుకొని జిల్లా పరిషత్ ఎన్నికల్లో కోట ప్రాంతానికి చెందిన నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని రెండో సారి నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయడం తో ఆయన పేరు మారుమ్రోగింది.  అప్పటి  కోట సమితి అధ్యక్షుడుగా ఉన్న నల్లపరెడ్డి  శ్రీనివాసులురెడ్డి గారిని నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎదిగేందుకు చంద్రశేఖర్ రెడ్డి గారి తో పాటుగా వీరు అండగా నిలిచారు. శ్రీనివాసులురెడ్డి గారు తరువాత కాలంలో కేవలం జిల్లా వరకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు.

1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఆనం కుటుంబ రాజకీయ ప్రాబల్యం తగ్గించడంలో సఫలీకృతం అయిన తన వర్గంలో భాగమైన నల్లపరెడ్డి సోదరులు సైతం జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం ఆనం కుటుంబం అనుసరించిన పోకడలు మార్గంలో వెళ్తున్న సమయంలో వారితో విభేదించి వారికి దూరమయ్యారు. దేశంలో ఎమెర్జెన్సీ విధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేసి పార్టీకి రాజీనామా చేశారు.

1977లో ఎమెర్జెన్సీ ఎత్తివేసిన తరువాత లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు స్థాపించిన జనతాపార్టీ లో చేరారు. పార్టీ రాష్ట్ర  నాయకత్వం వీరిని నెల్లూరు జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడు గా నియమించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గా భాద్యతలు స్వీకరించి 1977, 1980లలో లోక్ సభ, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన పార్టీ పరాజయం చవిచూసింది. జనతా పార్టీలో చీలికలు ఏర్పడిన చంద్రశేఖర్ నేతృత్వంలోని జనతాపార్టీ తో కొనసాగారు.

1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ నెల్లూరు జిల్లాలో నల్లపరెడ్డి సోదరులతో పాటుగా వీరిని ఆహ్వానించిన వారి అభ్యర్థన తిరస్కరించి జనతా పార్టీతో నే చివరి వరకు తన రాజకీయ ప్రయాణం చేశారు. 1983 ఏప్రిల్ 6 వ తేదీన గుండెపోటుతో మరణించారు.

ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వీరి సంతానం . పెద్ద కుమారుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా పలు పర్యాలు భాద్యతలు నిర్వహించారు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగితున్నారు.

శ్రీనివాస్ మహల్ థియేటర్ తో వీరికి  అవినాభావ సంబంధం ఉంది. రాజకీయాల్లో తీరిక లేకున్నా సినిమాలు అంటే ఆసక్తి ఉండటంతో   నెల్లూరు నగరంలో ఉన్న శ్రీనివాస్ మహల్ సినిమా థియేటర్ ను కొనుగోలు చేశారు. శ్రీనివాస్ మహల్ లో సినిమా లతో పాటుగా ఆయన రాజకీయ మరియు జిల్లా రాజకీయ కార్యకలాపాలకు కేంద్రం గా ఉండేది. జిల్లా రాజకీయాల్లో ఆనం వ్యతిరేక వర్గాలుగా ఉన్న బెజవాడ పాపిరెడ్డి, జి.సి.కొండయ్య, నల్లపురెడ్డి సోదరులు మరియు ఇతరులు ప్రతి రోజు సాయంత్రం థియేటర్ లో సమావేశాలు నిర్వహించేవారు.ఒక పక్కా రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న  థియేటర్ పర్యవేక్షణ భాద్యతలు సైతం  స్వయంగా వీరే చూస్తూ వచ్చారు.థియేటర్ పేరే తన ఇంటిపేరుగా మార్చుకుని  "శ్రీనివాస్ మహల్ రాజయ్య" గా సుప్రసిద్ధులైయ్యారు.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి రాజయ్య  గారితో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వి.ఆర్ కళాశాలలో విద్యార్ధి నాయకుడిగా ఉన్న నాటి నుంచి శ్రీనివాస్ మహల్ లో జరిగే సమావేశాల్లో వెంకయ్య గారి హాజరు తప్పనిసరిగా ఉండేది. అక్కడి నుంచే మొదలైన వీరి పరిచయం తరువాత కాలంలో జనతాపార్టీ లో విరివూరు కలిసి పనిచేస్తున్న సమయంలో పరిచయం కాస్త అనుబంధం గా మారి మరింత దృఢపడింది. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి ఉదయగిరి అసెంబ్లీ టిక్కెట్ కోసం ఏంతో మంది ప్రయత్నాలు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు గా ఉన్న వీరు వెంకయ్య గారికే ఇవ్వడం జరిగింది. ఆ  ఎన్నికల్లో గెలవడం తో వెంకయ్య గారికి  రాజకీయంగా మంచి గుర్తింపు లభించింది. తన రాజకీయ ఉన్నతికి దోహదపడిన రాజయ్య గారిని ఇప్పటికి మారువకుండా వారి కుటుంబసభ్యులను నెల్లూరు వచ్చిన ప్రతి సారి కలుస్తూ వస్తున్నారు.

రాజయ్య గారు స్నేహశీలి రాజకీయాల్లో సిద్ధాంతాల పరంగా విభేదించిన వ్యక్తిగతంగా అన్ని పార్టీల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నారు. ఉదాహరణకు  రాజకీయంగా ఆనం కుటుంబంతో విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా మాత్రంగా ఏంతో గౌరవించేవారు. 1978ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి  జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రులు  ఆనం వెంకట్ రెడ్డి, సంజీవ రెడ్డి గార్లకు నెల్లూరు, సర్వేపల్లి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చి వారి తరుపున ప్రచారం సైతం  చేశారు .

రాజయ్య గారు దృఢచిత్తుడు, ధైర్యశాలి , నిజాయితీ పరుడు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న తన రాజకీయ  అభివృద్ధికి కోసం  కాకుండా ప్రజల పక్షాన నిలిచి వారి కోసం కృషి చేస్తూ వచ్చారు. ఏంతో మంది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతను రాజకీయాల్లో ఎదిగేందుకు చేయూత నిచ్చారు.

 ప్రజల సంక్షేమం  కోసమే రాజకీయాలు అని భావిస్తూ     ఉన్నతమైన రాజకీయ పదవులను  చేపట్టకుండానే నెల్లూరు  జిల్లా రాజకీయాలను శాసించి, చివరి వరకు ప్రజల సమస్యల కోసమే పోరాడి  జిల్లా ప్రజల మదిలో నిలిచిపోయిన  వ్యక్తి  సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజయ్య గారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: