వై.ఎస్. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు..అయితే సరిగ్గా హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది.. హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైంది.. ఇలాంటి విషయాలను వివరించే కాక్ పిట్ రికార్డర్ ఏం చెప్పింది.. అనేది ఆసక్తికరం. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో ఇలాంటి కాక్ పిట్ వాయిస్ రికార్డర్లే అసలు గుట్టు విప్పుతాయి.


వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానికి కారణమైన హెలికాప్టర్ కాక్‌ఫీట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణను ఆ తరువాత అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి సేకరించిన హెలికాప్టర్ శకలాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఢిల్లీకి తరలించారు. వాటిని డీజీసీఏ అధికారులు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ ను విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. ఏటీసీ పరిధిలో ఎగురుతోంది.


9.22 నిమిషాల నుంచి 9.30 వరకు హెలికాప్టర్ పైలెట్లు తమకు దారి కనిపించడం లేదని, సరైన దారి చూపించమని పదేపదే చెన్నై ఏటీసీ అధికారులను బతిమాలుకున్నట్లు కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ ద్వారా వెల్లడైనట్లు కొంతమంది అధికారులు మీడియాకు తెలిపారు. సరిగ్గా 9.30 గంటల తర్వాత సంభాషణ ఆగిపోయినట్లుగా సమాచారం. సంభాషణ మొత్తం హిందీలో జరిగినట్లు ప్రచారం సాగింది.


వై.ఎస్. హెలికాప్టర్ ప్రమాదంపై నాలుగు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కేసును చట్టపరంగా సీబీసీఐడీ దర్యాప్తు చేసింది. ఇక సాంకేతిక లోపాలపై డీజీసీఏ పరిశోధించింది. దేశ భద్రతలో కీలకమైన రాడార్ కేంద్రాల వారిని ప్రశ్నించే అధికారం సీబీఐకి మాత్రమే ఉండడంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ మూడింటికి తోడు ఇద్దరు నిపుణులతో కూడిన కమిటీని కూడా నియమించారు. చివరకు వైఎస్ మరణం హెలికాప్టర్ ప్రమాదం కారణంగానే జరిగిందని తేల్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: