పెళ్లి వయసు అంటే అది కేవలం 18 సంవత్సరాలు పై బడి ఉండాలని అంతకు మించి ముందు చేసుకుంటే వారికి కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తుంది.. అంతేకాకుండా ఎన్నో రకాల చట్టాలను తీసుకొచ్చింది .. బాల్యవివాహాలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంత చెప్తున్న కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బాల్య వివాహాలు జరుగుతున్నాయి..తాజాగా ఓ బాల్య వివాహం అందరినీ కదిలించి వేస్తుంది.. 

 

 

వివరాల్లోకి వెళితే..ప్రభుతం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా బాల్యవివాహాలు మాత్రం ఆగడం లేదు. కొందరు చట్టాన్ని, న్యాయవ్యవస్థను పట్టించుకోకుండి చిన్నారులపై తమ క్రూరత్వాన్ని చూపిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ బాల్య వివాహం జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 13 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తి పెళ్లాడిన దారుణ ఘటన తెరపైకి వచ్చింది. అయితే అప్పటికే ఆ వ్యక్తికి భార్య చనిపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ షాద్ నగర్ లో ఓ మద్యం దుకాణంలో పని చేస్తుంటాడు. అతని భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఇతనికి పదేళ్ల బాబు, ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు.

 

 


అయితే మళ్లేష్‌కు అదే గ్రామంలో తన కుమార్తె కంటే ఐదేళ్లు పెద్దదైన ఓ బాలికపై అతని కన్ను పడింది. ఆ బాలిక తల్లి వ్యవసాయ కూలి. ఆమెతో అతనికి కుటుంబ స్నేహం ఉండడంతో బాలిక తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయాలని కోరాడు. దానికి బాలిక తల్లి కూడా సరేననడంతో ఈ నెల 15 న ఆ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో సోమవారం ఐసిడీఎస్, రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ఆ బాలిక, వారి కుటంబ సబ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 13 ఏళ్ల కూతురికి అలాంటి వ్యక్తితో ఎలా పెళ్లి చేస్తారంటూ ప్రశ్నించారు.ఈ విషయం పై అతనిని విచారిస్తున్నట్లు తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: