ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజులో పడడంతో చివరికి పచ్చని కాపురంలో చిచ్చు మొదలవుతుంది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో మనస్పర్ధలు మొదలై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరికి  ఒకరు ప్రాణంగా బతకాల్సింది  పోయి ఒకరి ప్రాణాలు ఒకరు  తీసుకునే పరిస్థితి తీసుకు వస్తున్నాయి ప్రస్తుతం అక్రమ సంబంధాలు. ఇప్పటివరకు ఇలా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనలు  ఎన్నో తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే.



 కట్టుకున్న వారి  కళ్ళు తప్పి వేరొకరితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతున్న భర్త గుట్టు రట్టు చేసింది భార్య. ప్రభుత్వ ఉద్యోగి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఎన్నో రోజుల నుంచి భార్యకు తెలియకుండా రాసలీలలు కొనసాగిస్తున్నాడు. కానీ చివరికి భార్యకు అనుమానం వచ్చి సరైన సమయం కోసం చూసి చివరికి రెడ్ హ్యాండెడ్  గా పట్టుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. పురూలియా జిల్లాకు చెందిన సుభాష్ అనే ఎక్సైజ్ ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప కూడా ఉంది. అయితే గత కొంత కాలం నుంచి సుభాష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.



 ఇటీవల తరచూ అసన్సోల్ ప్రాంతానికి ఉద్యోగం పని నిమిత్తం వెళ్లగా అక్కడ మేరీ అనే యువతితో పరిచయం ఏర్పడి ఆమెతో అక్రమ సంబంధానికి తెరలేపాడు. ఇక భర్త ప్రవర్తనలో మార్పు ని గమనించిన భార్య భర్తని ఒక కంట కనిపెడుతూ వచ్చింది. కొన్ని సార్లు ఇదే విషయం పై నిలదీయగా ఏమీ లేదు అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే పచ్చటి సంసారంలో చిచ్చు మొదలై తరచు భార్య భర్తల మధ్య గొడవలు జరగడం మొదలైంది. ఇటీవల సుభాష్ తన ప్రియురాలితో కలిసి ఓ లాడ్జిలో ఏకాంతంగా గడుపుతూ  రాసలీలల్లో మునిగి తేలుతున్న క్రమంలో... వెంటనే ఎవరో తలుపు బాదారు  బయటికి వెళ్లి చూడగా సుభాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎదురుగా భార్య నిలబడింది. దీంతో భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను చితకబాది పోలీసులకు అప్పగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: