ప్రధానంగా సీనియర్ మంత్రులు కొంతమంది అసలు మీడియాతో మాట్లాడక పోవడం గమనార్హం. మీడియాతో మాట్లాడిన సరే పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటనేది ముఖ్యమంత్రి జగన్ కు కూడా అర్థం కావడం లేదు. తన తండ్రి హయాంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై జగన్ సీరియస్ గా ఉన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలుగా అనుభవం ఉన్నవాళ్లు గతంలో మంత్రిగా పని చేసిన వాళ్ళు కూడా తనకు సలహాలు ఇవ్వకపోవడం సైలెంట్ గా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ లో అసహనం అనేది పెరిగిపోతుంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.
తన నుంచి అన్ని విధాలుగా సహాయసహకారాలు ఉన్నాసరే కొంతమంది మాత్రం అసలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అనే దానిపై జగన్ ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అధికారులతో కూడా పెద్దగా కొంతమంది మంత్రులు మాట్లాడటం లేదు. గత కొంతకాలంగా సచివాలయానికి కూడా కొంతమంది మంత్రులు దూరంగా ఉండటం పై ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం అనేది పెరిగిపోతుంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యవహారం కాస్త అలజడి రేపుతోంది.