న్యాయవాది దంపతులు హత్య పై హైకోర్టు విచారణ జరిపింది. గట్టు వామాన్ రావు,నాగమణి హత్య ల పై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదిక ను సమర్పించింది పోలీస్ శాఖ. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని ప్రశ్నించిన హైకోర్టు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని నిలదీశారు. A2-A3ల నుంచి ఎందుకు వాంగ్మూలం  తీసుకోలేదు అని నిలదీసింది. పోలీసులు బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

వాళ్ళను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయొచ్చు కదా అని ప్రశ్నించింది. మెజిస్ట్రేట్ ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు  వ్యాఖ్యానించింది. హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసు వాళ్ళు మొబైల్ ఫోన్స్  రక్తపు మరకలను కాల్ డేటా ని నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి ఎందుకు సీఆర్పీ పి సీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు  సేకరించలేదని నిలదీశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ వివరించారు.

రెండు బస్సుల డ్రైవర్లకు కూడా సాక్షులుగా  గుర్తించామని కోర్టుకు ఏజీ వివరించారు. ప్రత్యక్ష సాక్షుల కు ఎటువంటి రక్షణ కల్పించారన్న హైకోర్టు ప్రశ్నకు పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ వివరించారు. పోలీసు వారు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది  మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని పేర్కొన్నారు. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు వివరించారు. నేరస్థుల నుంచి  నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందని చెప్పుకొచ్చారు. కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేము రికార్డ్ చేయలేదని కేవలం 161 స్టేట్ మెంట్ మాత్రమే నమోదు చేశామని వివరించారు. ఇంకా రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: