మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో అటు భారతీయ క్రికెట్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. భారత జట్టుకు ఏకంగా మూడుసార్లు ఐసీసీ ట్రోఫీ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. అంతేకాదు తన మిస్టర్ కూల్ కెప్టెన్సీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా కూడా సక్సెస్ అయి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు.


 అయితే సాధారణంగా మహేంద్ర సింగ్ ధోనీ అటు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. కానీ ధోనీ అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఏదో ఒక పోస్టులు పెడితే యాక్టివ్గానే ఉంటారూ అని చెప్పాలి. అయితే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో ధోని కూడా తన అభిమానులకు అంతే గౌరవం ఇస్తూ సర్ప్రైస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.  ఏ చిన్న అవకాశం దొరికినా అభిమానులందరినీ సంతోషపెట్టడానికి ఏదో ఒకటి కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటారు మహేంద్రసింగ్ ధోని.


 ఇది ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. ఒక అభిమాని మహేంద్ర సింగ్ ధోని పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ దానిని అక్షర రూపం లో మార్చి ఒక లేఖను రాశాడు. ఎంతో కష్టపడి అది ధోని కి చేరేలా చేశాడు. అభిమాని రాసిన లేఖను చదివి  ఎంతగానో సంతోష పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంతో అద్భుతంగా లేఖరాశావ్ అంటూ మెచ్చుకున్నాడు. అంతే కాదు ఆ లేఖపై సంతకం కూడా పెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆ లేఖను ఫ్రేమ్ గా పెట్టి ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: