ఇక త్వరలో కేరళ క్రికెట్ సంఘం నిర్వహించబోయే స్థానిక టి20 క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆడనున్నాడు. గతంలో భారత జట్టులో స్పీడ్ బౌలర్ గా ఎంతో మంది బ్యాట్మెన్ లను వణికించిన శ్రీశాంత్ దాదాపు ఐదేళ్ల నిషేధం తర్వాత మొదటి సారి మళ్ళీ బంతి పట్టి మైదానంలోకి దిగనున్నాడు. అయితే ప్రస్తుతం ఏడేళ్ల నిషేధం తర్వాత శ్రీశాంత్ ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ పై బీసీసీఐ నిషేధం విధించగా న్యాయపోరాటం చేసిన శ్రీశాంత్ తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా విజయం సాధించాడు.
అయితే దాదాపు ఏడేళ్ల నిషేధం తర్వాత శ్రీశాంత్ మొదటిసారి బంతి పట్టి మైదానంలోకి దిగి టీ20 ఆడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి అంతకుముందు ఫామ్ లోకి వచ్చేందుకు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు శ్రీశాంత్. అంతేకాదు క్రికెట్లో మళ్లీ రాణించి భారత సెలెక్టర్లు చూపును ఆకర్షిస్తా అంటూ గతంలో ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో శ్రీశాంత్ క్రికెట్కు దూరమై బాగా కండలు పెంచి అందరిని సోషల్ మీడియా వేదికగా ఆకర్షించిన విషయం తెలిసిందే.