ఇక మరోవైపు రిషబ్ పంత్ కు సహకారం అందిస్తూనే రవీంద్ర జడేజా సైతం 88 పరుగులు తో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట లో భాగంగా ఇటీవల రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. 104 పరుగులు చేసిన రవీంద్ర జడేజా వికెట్ కోల్పోయాడు. అయితే సూపర్ సెంచరీతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ఇటీవలే ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ప్రత్యేక కాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు జడేజా.
ఇక ఈ మ్యాచ్లో 416 పరుగులు చేసిన టీమిండియా చివరికి ఆలౌట్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇప్పుడు వరకు టెస్టుల్లో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగి ఓకే ఏడాది క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్,మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్ లు కొనసాగుతున్నారు. 1986 లో కపిల్ దేవ్ ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు చేస్తే 2009లో మహేంద్రసింగ్ ధోని ఈ ఫీట్ సాధించాడు. 2010లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ అరుదైన ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి.